సీసీ రోడ్డు భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ జంగయ్య యాదవ్

Published: Saturday November 05, 2022
మేడిపల్లి, నవంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 1వ డివిజన్ నందిని నగర్ కాలనీలో నూతనoగా నిర్మించనున్న భూగర్భ  డ్రైనేజీ పనులను కాలనీ వాసులతో కలిసి మరియు సాయి దుర్గా నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ బిoగి జంగయ్య యాదవ్. డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.