నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైళ్ల

Published: Wednesday July 28, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మంగళవారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భు వనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం మండల వ్యాప్తంగా అందజేసిన 650 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన అందజేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తుందని,వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచారని, పేదప్రజలకు ఈ రేషన్ కార్డులతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజు, జెడ్పిటిసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాలనర్సింహ, స్థానిక సర్పంచ్ బొల్ల లలితా శ్రీనివాస్, ఎంపిటిసి పలుసం రమేష్, మండల రైతు సమన్వయ కమిటి కన్వీనర్ పనుమటి మమతా నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కూనపురి కవిత రాములు, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ఎంపిడిఓ గీతారెడ్డి, తహశీల్దార్ నాగలక్ష్మి, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.