హుజురాబాద్ ఎన్నికలలో గెలుపు టిఆరెస్ దే : జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఎ మాగంటి గోపీనాధ్

Published: Thursday October 28, 2021
హైదరాబాద్(ప్రజాపాలన సిటీ బ్యూరో) : హుజురాబాద్ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఎన్ని చీకటి ఒప్పందాలకు పాల్పడినా టి ఆర్ ఎస్ దే విజయమన్నారు జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఎ మాగంటి గోపీనాధ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టీఆరెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ లో 15 న జరగనున్న విజయ గర్జన సభకు నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు... గెల్లు శ్రీనివాస్ ఒక గొప్ప ఉద్యమకారుడని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు చీకటి ఒప్పందానికి పాల్పడి ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ దే విజయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కార్పొరేటర్ లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య, వనం సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.