*ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన నయీమ్ పాషా
Published: Wednesday October 19, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 18, ప్రజాపాలన : ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన నయీమ్ పాషా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ హాల్లో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గం లో స్వతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా 2018లో పోటీ చేసిన నయీం పాషా, తన మిత్ర బృందంతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ మధు, జిల్లా అధ్యక్షులు నల్లా నాగేంద్ర ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నయీమ్ పాషా మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆదర్శవంతమైన నాయకత్వానికి ఆకర్షితులమై పార్టీలో చేరామని ,జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో రంగు వంశీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: