అగ్ని ప్రమాద బాధితుని కి, అశ్వాపురం ఆదివాసి జె. ఏ.సి. సహాయం*

Published: Monday January 09, 2023
అశ్వాపురం ప్రజా పాలన.
అశ్వాపురం  మండలం లోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన కలేటి నాగేశ్వరావు కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయిన విషయం తెలుసుకున్న, వారిది చాలా నిరుపేద గిరిజన  కుటుంబం, కట్టుకునే బట్టలతో సహా కాలి బూడిదయ్యాయి.ప్రమాదంలో50 వేల రూపాయల నగదు, 10 క్వింటాళ్ల పత్తి, పిల్లల సర్టిఫికేట్లు, సామాన్లు పూర్తిగా దగ్దం అయ్యాయి, విషయం తెలుసుకున్న  అశ్వాపురం ఆదివాసి జాక్ సభ్యులు బియ్యం 50 కేజీలు ,5000 రూపాయలు, వితరణగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఆదివాసులకు ఎటు వంటి సమస్యలు ఉన్న ,వారి కోసమే ఆదివాసీ జె ఏ సి ఉన్న సంగతి మరవద్దు అని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కలేటి నరసింహారావు ఆదివాసి జాక్, మండల అధ్యక్షుడు కుంజ రామారావు, అశ్వాపురంమండల పిసా అధ్యక్షుడు చాప ముత్తయ్య ,సర్పంచులు బట్ట సత్యనారాయణ, మడకం సాదు, మరియు జాక్ నాయకులు బొర్రా శీను, కోరెం రామారావు, పాయం సర్వేశ్వరరావు, కొర్స దుర్గారావు ,పర్శిక సూరిబాబు ,తంగెళ్ల భద్రయ్య ,బుర్కా అశోక్, తదితరులు పాల్గొన్నారు.