షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి
మధిర జులై 22 ప్రజాపాలన ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక భద్రాచలం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించేందుకు శనివారం వస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైయస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాదరావు కోరారు. శుక్రవారం ఆయన మధిరలో విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలంగా చెందిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్ షర్మిల వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్ తెలంగాణ పార్టీ నిరంతరం ముందు ఉంటుందని ఆయన వెల్లడించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు లక్కినేని సుధీర్ సాయం బాబురావు ఆధ్వర్యంలో పినపాక మండలం బయ్యారం గ్రామంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు భారీ స్థాయిలో హాజరు కావాలని ఆయన కోరారు
Share this on your social network: