అన్నా అనగానే నేనున్నా అనే ఏకైక వ్యక్తి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు: గ్యారాల మల్లేష్

Published: Thursday July 01, 2021

గుమ్మడిదల, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండల కేంద్రం లో నాయి కోటి భాస్కర్ వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ఇంటికి పెద్దన్నలా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకున్నారని ఆయన అన్నారు. ఈ అర్ధరాత్రి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అనగా నేనున్నా అనే వ్యక్తి అని కొనియాడారు. ఇలాంటి వారు నూటికి ఒకరే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్ ముదిరాజ్ వావిలాల్ పి ఏ సి ఎస్ ఎస్ మాజీ చైర్మన్ మణిక్యరావు ముదిరాజ్ ఊట్ల ముదిరాజ్ సంఘ పూజరి రాజు కుత్బుల్లాపూర్ మండల్ అధ్యక్షుడు డిపోచంపల్లి రాము నగేష్  తదితరులు పాల్గొన్నారు.