ఎం ఎల్ ఏ ను కలిసిన మున్సిపల్ కమిషనర్ రజిత

Published: Friday April 16, 2021

బెల్లంపల్లి మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల బెల్లంపల్లి మున్సిపాలిటీ కి నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత గురువారం నాడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది, ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో చాలా సమస్యలు ఉంటాయని వాటిని స్థానిక అధికారుల, రాజకీయనాయకుల, ప్రజాప్రతినిధుల, మద్దతు తీసుకొని సమస్యల్ని పరిష్కరించాలని ఆమెను కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రజిత మాట్లాడుతూ మీ ఆదరాభిమానాలు సహాయ సహకారాలతో బెల్లంపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతాను అని ఆమె హామీ ఇచ్చారు.