దీనబందు కాలనిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
Published: Friday May 07, 2021
కూకట్ పల్లి :(ప్రజాపాలన) కరోనా మహమ్మారి ఉదృతం అవుతున్న నేపథ్యంలో కూకట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని దీనబందు కాలనీ అధ్యక్షుడు మహేందర్ నాయక్ తన కాలనీలోని అన్ని రోడ్లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఎంటమాలజీ సిబ్బందిచే పిచికారి చేయిపించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మహేందర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోన వైరస్ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవస పరిస్తితులలోనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణ, ఆవుల రాజు, నగన్న, సుహాస్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: