సీఎం ఆర్ఎఫ్ నిరుపేదలకు పెద్ద వరం..

Published: Monday June 21, 2021
పాలేరు, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరమని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ అన్నారు. మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో వి.బాలాజీ అనే బాధితుడు కు రూ.2.50 లక్షల చెక్ ను ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది కుటుంబాల్లో సీఎంఆర్ఎఫ్ వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. కష్టకాలంలో కూడ సీఎంఆర్ఎఫ్ ను బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు లిక్కి వీరబాబు, పాలడుగు రామయ్య, వేముల నర్సయ్య, ముప్పాళ్ల వెంకయ్య, రమణి, జిల్లపల్లి నాగేశ్వరరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.