దుప్పట్లు పంపిణీచేసిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు

Published: Monday January 02, 2023
తల్లాడ, జనవరి 1 ప్రజాపాలన న్యూస్

తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో పరిశుద్ధాత్మ మినిస్ట్రీస్ షాలోము వాగ్దాన ప్రార్థన మందిరము ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ వృద్ధాశ్రమాన్ని గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు ఆయన దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ శీతాకాలంలో చలి ఎక్కువగా ఉన్నందునా వృద్ధులు అవస్థలు పడుతున్నారని, వాటిని గుర్తించి తాను ఈ దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమైన వారి సమస్యలను పరిష్కరిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాస్టర్ సాల్మన్, కరుణ దంపతులు, ప్రసాద్, వృద్దులు పాల్గొన్నారు.*