ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సిఆర్ఎంఫీ సహాయం అందజేత

Published: Thursday April 13, 2023

జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ సిఆర్ఎంఫీ ఐదు లక్షల సాంక్షన్ సహాయం పత్రాన్ని యట రాజన్న కు అందజేశారు. మండలంలోని జన్నారం గ్రామానికి చెందిన యాట రాజన్న కూతురు స్వాతి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారి వైద్యానికి ఐదు లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతాయని, ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి నిరుపేద కుటుంబానికి చెంది అంత డబ్బు ఖర్చు పెట్టలేక బాధపడుతూ ఉండగా, చిన్నారి ఆసుపత్రి ఖర్చు విషయమై ఆ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ జంగం రవి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నారి ఆసుపత్రి పత్రాలను సిఆర్ఎంఫ్ కు ఎమ్మెల్యే అందచేశారు. అనంతరం చిన్నారి ఆసుపత్రి ఖర్చుల కోసం విడుదలైన సిఆర్ఎంఫ్ ఐదు లక్షల శాంక్షన్ పత్రన్ని చిన్నారి తండ్రి రాజన్నకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.