సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం.

Published: Thursday November 18, 2021

కొడిమ్యాల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామపంచాయతీ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు గ్రామపంచాయతీ సేవలపై ఈనెల22న కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో నిర్వహించే జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ఎంపిక కావడంతో పలువురు నాయకులు పునుగోటి కృష్ణారావును శాలువాలతో ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, మాట్లాడుతూ గ్రామపంచాయతీ సేవలపై జాతీయ స్థాయిలో నిర్వహించే వర్క్ షాప్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి హిమ్మత్ రావు పేట గ్రామపంచాయతీ సర్పంచ్ గా మీకు ఆహ్వానం అందడం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ సింగిల్విండో చైర్మన్ పోలు రాజేందర్, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, సర్పంచులు సామంతుల ప్రభాకర్ తునికి నర్సయ్య ఏగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం, మహేష్ మహిపాల్, మల్లేష్ యాదవ్, బొడ్డు రమేష్, నరేష్, ఉపసర్పంచ్ లఫోరం మండల అధ్యక్షులు కోలాపురం రమేష్, నాయకులు, ఆకునూరి మల్లయ్య, తిరుపతి రెడ్డి, సాగర్ రావు, కృష్ణాకర్, పవన్, రఘునందన్, బుర్ర సంతు, తిరుమలేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు