రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

Published: Tuesday May 25, 2021
సారంగాపూర్, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అలసత్వపు నిర్లక్ష ధోరణిని నిరసిస్తూ నిజంగా విచారకరం అని రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని సారంగాపూర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ రైతుగోస దీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని రైతుబంధు నిధులు విడుదల చేసి రైతుగోసను తీర్చాలని ప్రభుత్వన్నీ వరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.