మందలపు సాయిబాబా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం
Published: Wednesday June 16, 2021
కూకట్ పల్లి, జూన్ 15, ప్రజా పాలన ప్రతినిధి : మంగళవారం కెపిహెచ్బి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందలపు సాయిబాబా చౌదరి జన్మదినం సందర్భంగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మందలపు సాయిబాబు చౌదరి మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అడుగుజాడల్లో నడుస్తూ... ఆయన చూపించిన స్పూర్తితోనే నిత్యం ప్రజాసేవలో పాల్గొంటూ. మరింత ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో KPHB డివిజన్ ఇంచార్జ్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, శ్యామల రాజు, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు, బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, సబియా గౌస్ ఉద్దీన్, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, కూకట్పల్లి రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: