ప్రతిపక్ష నాయకుడు భట్టిని సస్పెండ్ చేయడం ఆప్రజాస్వామికం - కాంగ్రెస్

Published: Thursday March 10, 2022

బీరుపూర్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రోజున అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రతి పక్షనేత మల్లు భట్టి విక్రమార్కను అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసి స్పీకర్ సస్పెండ్ చేయడంతో టి.పీసీసీ పిలుపు మేరకు బీరుపూర్ మండల్ ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుడు భట్టి ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతుకలను తొక్కిపడేస్తున్నా సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాట పద్మారమేష్ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు పార్టీ ప్రెసిడెంట్ చేరిపూరి శుభాష్ గుడిసె జితేందర్ రంగు లక్ష్మణ్ పోల్సాని నవీన్ రావు బదినపల్లి శంకర్ ఏనుగు జోగిరెడ్డి నారపాక కమలాకర్ సుద్దాల తిరుపతి బైరవేని సత్తయ్య చెట్ల శేఖర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.