రామంతపూర్లో పిక్సెల్ డయాగ్నొస్టిక్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Saturday March 20, 2021
మేడిపల్లి, మార్చి19 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతపూర్ గణేష్ నగర్లో టీవీ స్టూడియో సమీపాన పిక్సెల్ డయాగ్నొస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్ లు హాజరైై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ఖర్చులతో నాణ్యమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ డయాగ్నొస్టిక్ సెంటర్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించడంతోపాటు ప్రారంభోత్సవం ఆఫర్ గా 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు నిర్వాహక రేడియాలజిస్ట్ డాక్టర్లు రవి రాజా, జితేందర్ రెడ్డి తెలిపారు