మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయి చిత్రపటానికి ఘనంగా నివాళులు

Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : భారత మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయి వర్ధంతి సందర్భంగా తుర్కయంజాల్ కూడలిలో భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అద్యక్షుడు తూల్ల నర్సింహ ఆద్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారి మహనీయుని చిత్ర పటానికి ఘనంగా సోమవారం నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బచ్చిగల్ల రమేష్ మాట్లాడుతూ వాజ్ పాయ్ గొప్పతనం గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయన పార్లమెంట్ లో ఒకే ఒక్క సీటు తో అధికారం కోల్పోతాము తెలిసి కూడా ఎక్కడ బేరసారాలు కూడా అడని గొప్ప పరిపాలన అదక్షుడు వాజ్ పాయ్  అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో పూర్తిస్థాయిలో పరిపాలించిన ఘనుడు వాజ్ పాయ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వాజ్ పాయ్ అని, ఆ మహనీయునికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రుణపడి ఉండి ఆయన ఆశయ సాధన కొరకు పాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యదర్శి నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా మీడియా సెల్ కన్వీనర్ కొండ్రు పురుషోత్తం,  మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మాడుగుల బాలకృష్ణ గౌడ్, మున్సిపాలిటీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంచనాని దాస్, మున్సిపాలిటీ బి సి మోర్చా అధ్యక్షులు మోహన్ గౌడ్, బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు గంగిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, భగీరథ్ సింగ్ రాథోడ్, మేతరి సత్తయ్య, బిజెపి కార్యవర్గ సభ్యులు రాజు, సిల్విజి దయానంద చారి మారాగౌని ఆకాశ్ గౌడ్, మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.