శీలం పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో గ్లోబల్ అవెర్నేస్ కార్యక్రమం

Published: Thursday March 30, 2023
మధిర, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి; మధిర పట్టణంలోని శీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు గ్లోబల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమెరికాలోని డల్లాస్ నుండి ప్రముఖ మోటివేటర్ వెన్నపూస శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు విద్యార్థి దశ నుండే లక్ష్యాలని ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తే విజయం మీ సొంతం అవుతుందని తెలియజేశారు.అనంతరం కళాశాల డైరెక్టర్ శీలం వెంకటరెడ్డి చేతుల మీదుగా వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టిఎఫ్ నాయకులు కోటిరెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ మాధవరెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.