భక్తిశ్రద్ధలతో సుబ్రమణేశ్వరస్వామి షష్ఠి. చేవెళ్ళ నవంబర్ 29: (ప్రజాపాలన):-
Published: Wednesday November 30, 2022
సుబ్రమణ్యేశ్వరస్వామి షష్టి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం షష్టిపర్వదినాన్ని పురష్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు క్షేత్రం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లిఖార్జునస్వామి ఆలయంలో ప్రధానార్చకులు జె.ఎం. సురేష్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. షష్టి పర్వదినాన్న వివిధ దోషాలు, సర్పదోష నిర్వహణకు పాల అభిషేకం చేస్తే మేలు జరుగుతుందని, అదేవిధంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
Share this on your social network: