కర్రు సాత్విక్ 14 వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
Published: Wednesday May 18, 2022
మంచిర్యాల టౌన్, మే 17, ప్రజాపాలన : కర్రు సాత్విక్ 14వ జన్మదినం సందర్భంగా కర్రు శ్రీనివాస్ - సుమలత దంపతుల మృతి చెందిన కుమారుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ,మంగళవారం రోజున మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో రక్తదాన శిబిరం, తలసేమియా పిల్లలకు, తల్లిదండ్రులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లోని 30 మంది కాంట్రాక్టు కార్మికులతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి పడల రవీందర్,కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్,గుమ్మడి శ్రీనివాస్,సిర్పూరం శ్రీనివాస్, తోట రాజేష్,మోగిలి,నర్సింగ్,స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: