డివిజన్లో ఇంటింటా మొక్కలు పంపిణీ చేసిన కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య

Published: Friday July 09, 2021
మేడిపల్లి, జూలై8 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య ఆధ్వర్యంలో డివిజన్లోని న్యూ హేమ నగర్లో ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం జెసిబితో కాళీ స్థలాలలో, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మక్ బాలయ్య, డివిజన్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బైర బోయిన మల్లేశ్, కోశాదికారి ఉన్నం వెంకటేశ్, నాగరాజు, చక్రవర్తి, రాజు. న్యూ  హేమ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.