ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు స్వీకరణ. జిల్లా షెడ్యూల్డ్ కులముల అభ

Published: Saturday July 23, 2022

 మంచిర్యాల బ్యూరో, జూలై 22,

ప్రజాపాలన :

 

జిల్లాలో 10వ తరగతిలో 7.0 గ్రేడ్ ఆపైన సాధించిన ఎన్.సి., ఎన్.టి., బి.సి., ఈ-బి.సి., దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. రవీందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 2. సంవత్సరాల ఇంటర్మీడియట్, ఎంసెట్ కొరకు ప్రవేశాలు పొందుటకు ఈ పాన్ వెబ్సైట్ (epass.cgg@telangana.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు గడువును ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. అర్హత గల విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.