ఎన్జీవో శ్రీనివాస్ కు దక్కిన అరుదైన గౌరవం

Published: Saturday April 15, 2023
తల్లాడ, ఏప్రిల్ 14 (ప్రజాపాలన న్యూస్):
తెలంగాణా శుక్రవారం హైదరాబాద్ జి సి యస్ వల్లూరి ఫౌండేషన్ వారు ఐ యస్ ఓ సేవా గుర్తింపు మెమోంటో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపాటి దాసు సహాయ సహకారాలతో ,,మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,,నిర్వాహకుల సేవలు పరిశీలించి నిర్దారణ ధ్రువీకరణ పత్రాలు జ్ఞాపికను అందించి, పేద బాధిత ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడి ఐ ఎస్ వో రాజా పత్రాన్ని జారీ చేసి చేయుతను అందించారు..
ఈ కార్యక్రమంలో బొడ్డపాటి దాసు,మేకతోటి శశి కిరణ్, కె అన్నపూర్ణ, రుక్మిణ, ఆకునూరి, మర్తమ్మ, యస్ ,రామకృష్ణ,నాని, షాహేరా,నిర్మలా, మణి, సంధ్యా రాణి, నాగరాజు,బోస్,జేజమ్మ, రమ,కోణిజర్ల ఆర్ కె,ఆంద్రా తెలంగాణా సామాజిక కార్యకర్తలు విశ్లేషకులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ కి ధన్యవాదాలు జై భీమ్ లు తెలియజేసారు.