రావినూతల పడమర తండాలో జ్యోతిరావు పూలే కు ఘన నివాళి
Published: Tuesday November 30, 2021
బోనకల్, నవంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామం పడమర తండలో జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని మహిళా సంఘం మరియు గిరిజన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వామండల ఉపాధ్యక్షురాలు గుగులోతు శారద మాట్లాడుతూ సంఘ సంస్కర్త, విద్యావంతుడు, పేదల పెన్నిధి, సేవాతత్పరుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకై అందరూ కృషి చేయాలని, నేటి సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు, జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఐద్వా సీనియర్ నాయకురాలు ధరావతు అచ్చమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ధరావత్ సునీత, గుగులోతు లక్ష్మి, ధరావత్ సీత, గిరిజన యూత్ ధరావత్ నరేష్, భానోతు నరేష్, జొన్నలగడ్డ హేమంత్, ధరావత్ జగన్, ధరావత్ క్రిష్ణ, గుగులోతు సాయి, బానోత్ కార్తీక్, భానోత్ స్వప్న, భానోత్ దుర్గ, ధరావతు తావిరియ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: