కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Published: Monday April 03, 2023

బోనకల్ ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట గ్రామంలోకల్వరి టెంపుల్ పాస్టర్ సుంకర ఏసుబాబు ఆధ్వర్యంలో కలకొట బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభించారు. సంఘ పెద్దలు, మట్టల ఆదివారం సందర్భంగా మట్టలు పట్టుకొని ఊరేగింపు కొనసాగించారు. ఏసుక్రీస్తు లోక రక్షకుడని, ఏసుక్రీస్తు కు జై, ప్రభువైన యేసుక్రీస్తు,కు జై ఊరేగించారు ఈ సందర్భంగా యేసు బాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు అందరికి ప్రభువని ఆయన మన పాపాల కోసం కల్వరి శిలువ పై మరణించి. మనకొరకు శిలువ వేయబడ్డాడని ...మళ్ళీ తిరిగి మూడవరోజు పునరుద్దారుడై లేచాడని. అయన ప్రసంగించారు.. ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ అసిస్టెంట్ పాస్టర్ యాకోబు , సంఘ పెద్దలు తోటపల్లి యేసు , బందెల ముత్తయ్య ,దుంపల విజయరాజు తోటపల్లి ముత్యాలు, యంగల యేసు, పురుషోత్తం, ముకంటి, యూత్ అధ్యక్షులువేము కిషోర్, కటికల శ్యామ్ బాబు, దుంపల శ్రవణ్, సుంకర సాత్యిక్, బలుగురి సుదీర్, వేము ప్రశాంత్, దుంపల శ్రీశాంత్, సుంకర హనీ, తోటపల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.