శ్రీనివాస్ నగర్ లో అన్నపూర్ణ క్యాంటీన్
Published: Monday May 17, 2021
రామచంద్రపురం, మే16, ప్రజాపాలన ప్రతినిధి : రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని సండే మార్కెట్ లో లాక్ డౌన్ లో నిరుపేదలకు జీవన ఉపాధి లేనందున తెలంగాణ ప్రభుత్వంచే హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ వారి సౌజన్యంతో జి ఎచ్ యం సి ఆధ్వర్యంలో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కోరిక మేరకు ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ (భోజనం) ప్రారంభించరు, సుమారు 200 మందికి ఫుడ్ బాక్స్ లు పంపిణి చేసిన కార్పొరేటర్, లాక్ డౌన్ ఉన్న అన్ని రోజులు ఉదయం సాయంత్రం అన్నపూర్ణ భోజనం పంపిణి చెయ్యనున్నామని, నిరుపేదలందరు సద్వినియోగం చేసుకోవాలి వారు కోరారు. శ్రీనివాస్ నగర్ కాలనీ, మందుముల లో నివాసం ఉంటున్న ప్రజలకు, జి ఎచ్ యం సి కార్మికులకు బోజనాలను పంపిణి చేశారు.
Share this on your social network: