తుల్జా భవాని అమ్మవారి దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేత

Published: Thursday October 07, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజికవర్గం మంచాల మండలం పరిధిలోని పటేల్ చెరువు తండలో తుల్జా భవాని అమ్మవారి దేవాలయ నిర్మాణానికి తండా వాసుల కోరికమేరకు ముఖ్యఅతిథిగా తండాకు విచ్చేసి 33వేల రూపాయలు అందజేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా తండా పెద్దమనుషులు మర్రి నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు, నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాడి పంటలు, మరియు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో నోముల ఎం పి టి సి జయ నందం, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లచ్చిరాం, గణేష్ నాయక్, తండా పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.