కరోనాతో అధైర్య పడకండి జాగ్రత్తలు తీసుకోండి

Published: Wednesday May 12, 2021
మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి
మేడిపల్లి, మే11 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ తో  భయబ్రాంతులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ మందముల్ల పరమేశ్వర్ రెడ్డి ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో వైరస్ వ్యాప్తి నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ డివిజన్లోని శ్రీనివాస హైట్స్ లో  సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేయించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకారం ఉండాలని తెలిపారు. డివిజన్లోని కాలనీల్లో ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగిస్తూ, పారిశుద్ధ్యంను మెరుగు పరచడానికి కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వింగ్ ఏ అధ్యక్షులు రామకృష్ణ గుప్తా, వింగ్ బి అధ్యక్షులు శంకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ గుప్తా, రంగనాథ్, సాయిసుమన్, రమేష్, సాయి, సుంకు శేఖర్ రెడ్డి, గొరిగ మహేష్, నరేష్, జితు తదితరులు పాల్గొన్నారు.