జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోవరుణదేవుడుశాంతించాలని పూజ

Published: Friday July 15, 2022

మధిర జూలై 14 ప్రజా పాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురువారం నాడు ఆలయం నందు  వరణ దేవుడు శాంతించాలని మంత్ర జప హోమంతో ప్రత్యేక పూజ కార్యక్రమంగత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమై తీవ్ర పంట నష్టం మరియు ఆస్తి నష్టం తోపాటు జనజీవనం అస్తవ్యస్తమైనందున  వరుణ దేవుడు శాంతించి ఈ అతివృష్టి నుండి ఈ రాష్ట్ర ప్రజలను విముక్తులను చేసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని  శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జమలాపురం నందు అతివృష్టి నివారణ మంత్ర జపాలు, ప్రత్యేక హోమము,  ప్రత్యేక పూజలు  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది మరియు ఆలయ అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు