ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి* *పిఏసి

Published: Thursday December 29, 2022

రైతులకు విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించి వారికి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పోల్కంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చిన్నగంట రాజశేఖర్ రెడ్డికి వినతిప్రాన్ని అందజేసారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యక్షులు గూడెం అశోక్ మాట్లాడుతూ రైతులకు  ఎరువులను సకలంలో అందించాలని ఆయన అన్నారు. ఎరువులు విత్తనాలు, అందుబాటులో లేక దళారులు రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నరు తప్ప చేసిందీ ఏమి లేదని అన్నారు. ఎరువులు సకాలంలో ఇవ్వకుంటె రైతులకు ఏమీ ఉపయోగం ఉంటుందని తెలిపారు. వారం రోజుల్లో ఎరువులు అందుబాటులో ఉంటాయని చైర్మన్  సిఇఒ పల్సం లక్ష్మయ్య హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో  రైతు సంఘం గ్రామ అద్యక్ష,కార్యదర్శులు కె.జంగయ్య, మాడుగుల కరుణాకర్ రెడ్డి,అమనగంటి బాలరాజు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి.స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు అమనగంటి నర్సింహా నాయకులు కంబలపల్లి బాలరాజు, శంకరయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు,