త్రీబుల్ ఐటీ సీట్ సాధించిన జిల్లేపల్లి జస్వంత్ సన్మానించిన సామాజిక సేవకుడు నిహాల్ డయాగ్నస

Published: Thursday October 07, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామనికి చెందిన జిల్లేపల్లి శ్రీనివాస్ ఉష దంపతుల కుమారుడు జస్వంత్ బాసరలోని త్రిబుల్ ఐటీ స్వీట్ సాధించినందుకు కు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన సామాజిక సేవకుడు నిహాల్ డయాగ్నొస్టిక్ సెంటర్ అధినేత శ్రీనివాస్ మరియు గ్రామ సర్పంచ్ బ్రహ్మయ్య. ఈ సందర్భంగా నిహాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబం నుండి వచ్చిన జస్వంత్ త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం అభినందనీయం. ఇకపై కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు మరియు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపాడు