రైతు బజార్ మార్కెట్ యార్డు లోకి తరలింపు
Published: Monday June 20, 2022
మధిర ప్రజాపాలన ప్రతినిధి జూన్ 19మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల కూరగాయల మార్కెట్ మరియు రైతు బజార్ను మార్కెట్ యార్డ్ ఆవరణలోకి తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి ఆదివారం విలేకరులకు తెలిపారు. రైతు బజార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయలతో సమీకృత మార్కెట్ నిర్మించడం జరుగుతుందని ఆమె తెలిపారు. సమీకృత మార్కెట్ పూర్తయ్యేవరకు మధిర మార్కెట్ యార్డు వద్ద రైతు బజార్ కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. పట్టణ ప్రజలు మరియు మధిర పరిసర ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని ఆమె పేర్కొన్నారు
Share this on your social network: