ప్రమాదానికి గురైన వారిని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ దారిశెట్టి రాజేష్
Published: Monday June 27, 2022
కోరుట్ల, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన మరిపెల్లి నాగరాజ్ మరియు మహేష్ గత ఐదు రోజుల క్రితం ప్రమాదం జరగడం వల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రోజున జగిత్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ పరామర్శించారు.
అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం మరిపెల్లి నాగరాజ్ కు 5000/- రూపాయలు మరియు అనాధ అయినటువంటి మహేష్ కు 5000/-రూపాయిలు ఆర్థిక సహాయం చేస్తూ, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని వారి కుటుంబాలకు బరోసా ఇచ్చారు.
Share this on your social network: