రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మధిర

Published: Monday January 16, 2023
 రూరల్ జనవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జిలుగుమాడు  నందు  సంక్రాతి పండుగ సందర్బంగా రాజీవ్ యూత్  వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థి మున్సిపల్ చైర్మన్ మొండితోక లత హాజరై ముగ్గులు పోటీలు తిలకించి అనంతరంముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు  మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీ నిర్వహించిన వారికి ఈ సంక్రాంతి రోజు భోగి రోజు ముగ్గులు పోటీలు నిర్వహించటం శుభదినం అని ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో మహిళల్లో ఉత్తేజ ఒకరిపై ఒకరు ప్రేమమానాలు ఉంటాయని ఆమె తెలిపారు

ఈ కార్యక్రమం లో ఆత్మ కమిటీ చైర్మన్ రింగిశెట్టి కోటేశ్వరరావు ,8వార్డ్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్  యనంశెట్టి వెంకట అప్పారావు ,మున్సిపాలిటీ కో ఆప్షన్స్ సభ్యులు కోటారి రాఘవరావు ,బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ ,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేవినేని శ్రీనివాసరావు ,గ్రామ పెద్దలు దోర్నాల చిన్న వెంకటేశ్వర్లు దోర్నాల కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, వేల్పుల కొండ, టిఆర్ఎస్ నాయకులు మునగ వీరబాబు,రాజీవ్ యూత్  కమిటీ సభ్యులు, గ్రామస్తులు మహిళలు తదితరులు  పాల్గొన్నారు