అశ్వాపురం మండలంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.... అశ్వాపురం (ప్రజా పాల
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ చరిత్రని అవునత్యాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదే కేశవ రెడ్డి మాట్లాడుతూ 138 సంవత్సరాల చరిత్రలో అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడంతో తో పాటు దేశ ప్రజల్ని కన్న తండ్రిలా కాపాడుకుంటూ కన్నతల్లిలా పెంచుకున్నదని దేశ ప్రజల ఉన్నత కోసం అనేక సంస్కరణలు తీసుక రావడం వడం జరిగిందని ,దేశంలోని ప్రజలందరికీ సరిపడా ఆహార ధాన్యాలు పండించడానికి ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందని, ఉపాధి కల్పించడం కోసం అనేక కర్మాగారాలు నిర్మించడం జరిగిందని, అనేక విద్య సంస్థను ఏర్పాటు కోసం భూసంస్కరణ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం బ్యాంకులను జాతీయకరణ చేయడం ప్రజలకు ఉపయోగపడేటటువంటి అనేక సంస్కరణ తీసుకురావడం జరిగిందని, ఈనాడు భారతదేశం ప్రపంచ దేశాల్లో సకర్వంగా నిలబడింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాల వలన అని చెప్పక తప్పదని, అటువంటి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు అందరూ ఐక్యంగా సమస్త కృషితో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బేతం రామకృష్ణ ,సర్పంచ్ బట్ట సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షులు బచ్చు వెంకటరమణ, తూము వీర రాఘవులు, కొండ బత్తుల ఉపేందర్ ,మా నాది సైదులు ,ఆటో నరసింహారావు, గుర్రం చెన్నయ్య మల్లెం కరుణ్ ,బొల్లినేని సురేష్ ఎస్ కే మోసిన్ బెల్లి శ్రీశైలం నాగేశ్వరరావు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: