ఉపాధి కోసం కోర్సులను నేర్చుకోండి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday September 23, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సులను నేర్చుకుని మహిళలు ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు స్థానిక సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, శిక్షణా తరగతులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సింగరేణి సంస్థ ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ ఉందని వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోని ఉపాధి పొందాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం, సంజీవ రెడ్డి, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాధకుమారి, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.