సిపిఐ మండల కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన యంగల

Published: Saturday July 23, 2022
బోనకల్, జులై 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాపల్లిలో జరిగిన సిపిఐ 15వ మహాసభలలో సిపిఐ మండల కార్యదర్శిగా యంగల ఆనందరావు ఎకగ్రీవంగా రెండోసారి ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు తనను ఎకగ్రీవంగా ఎన్నికచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. సహాయ కార్యదర్శులు జక్కుల రామారావు, ఆకెన పవన్ లు రెండో సారి ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వీరితో కార్యవర్గ సభ్యులుగా 13 మంది, కౌన్సిల్ సభ్యులుగా 33 మంది ఎకగ్రీవంగా ఎన్నికైయ్యారు.