అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Friday November 11, 2022
బెల్లంపల్లి నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి నియోజకవర్గం  కాసిపేట మండలకేంద్రానికి చెందిన దాగం అరుణ్ కుమార్,  ఇటీవల మరణించగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గురువారం  వారి ఇంటికి వెళ్లి అరుణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ పల్లె చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు , సర్పంచ్ దేవి , ఉప సర్పంచ్ సుమన్ , ఎంపీటీసీ రాంచందర్ , బెల్లంపల్లి ఏఎంసి డైరెక్టర్ వాసుదేవ్, మాజీ జడ్పీటీసీ  సత్తయ్య , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ప్రభాకర్, బుగ్గరాజు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.