శ్రీనును పరామర్శించిన మట్టా దయానంద్..

Published: Monday June 13, 2022
 తల్లాడ, జూన్ 12 (ప్రజాపాలన న్యూస్):  తల్లాడ  మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన సీకే న్యూస్ శ్రీనువసరావు తండ్రి ఇస్నేపల్లి కోటయ్య ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం ఆయన దశదిన కర్మ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి శ్రీనును పరామర్శించారు. 
ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి రమేష్, గణేశుల రవి, పొట్టేటి బ్రహ్మారెడ్డి, షేక్. యాకుబ్ పాషా  ఉన్నారు.