ఉత్తమ తహసిల్దార్ అవార్డు గ్రహీత సైదులు అభినందనలు మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత
Published: Wednesday August 18, 2021
మధిర, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా లో ఉత్తమ తహసీల్దారుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి చేతుల మీదుగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రాన్ని అందుకున్న మధిర తహసీల్దారు సైదులను మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 8వార్డ్ కౌన్సిలర్ అప్పారావు, 2వార్డ్ కౌన్సిలర్ ఇక్బల్, 19వార్డ్ కౌన్సిలర్ మాధవి, 11వార్డ్ కౌన్సిలర్ మాధురి, కో ఆప్షన్ నెంబర్ రాఘవ, కాశీ, తెరాస నాయకులు ఓంకార్, మేడికొండ కిరణ్, ఎర్రగుంట రమేష్, మూతవరపు ప్యారీ పాల్గొన్నారు.
Share this on your social network: