మోదీ చిరంజీవిగా వర్ధిల్లాలని సురిభి కాలనీలో మృత్యుంజయ హోమం : రాజు శెట్టి కురుమ

Published: Tuesday January 11, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన : బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా, మోదీ ఆయురారోగ్యలతో చిరంజీవి గా వర్ధిల్లాలని శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో సురభి కాలని శివాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ విచ్చేశారు. కార్యక్రమంలో వేద మంత్రాలు, పండితుల సమక్షంలో హోమం నిర్వహించిన అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ పంజాబ్ లో మోదీ గారికి పై జరిగిన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ హేయమైన బుద్ధికి నిదర్శనం అని, మోదీ భారత దేశాన్ని విశ్వ గురువు గా నిలిపేందుకు చేస్తున ప్రయత్నాన్ని, అభివృద్ధి పనులను తట్టుకోలేక కాంగ్రెస్ ఇలాంటి నీచమైన పనులకు తెగబడుతుందని, మోదీ పై ఈగ వాలిన ఊరుకోం అని, మోదీ కోసం ఎంతటి సహసానికైన సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోదీ చిరంజీవిగా కలకాలం వర్ధిల్లాలని, దేశానికి మార్గదర్శకం చెయ్యాలని ఆ మహా శివుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్.సి మోర్చా అధికార ప్రతినిధి శ్రీమతి కాంచన కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు అశోక్ బాల్ద, శ్రీమతి నర్రా జయ లక్ష్మి, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి అందెల కుమార్ యాదవ్, జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేంద్ర రావు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాధ మూర్తి, ఎక్జిక్యూటివ్ మెంబర్ సుమ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ వినత సింగ్, జిల్లా ఓ.బీ.సి మోర్చా కార్యదర్శి భారత్ రాజ్, అసెంబ్లీ మహిళ మోర్చాకో కన్వీనర్ బీమని విజయ లక్ష్మి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మా, ఉపాధ్యక్షులు శ్రావణ్ పాండే, సి.బాలరాజు, బీ.జే.వై.ఎం నాయకులు బొట్టు కిరణ్, మహిళ నాయకులు అరుణ కుమారి, వి. గాయత్రి, స్వాతి, బబ్లీ దేవి, మీన, అంకమ్మ, నివేదిత, బీ.సత్య నారాయణ, వీ.హెచ్.పి నాయకులు బండాడి కృష్ణ, రవీంద్ర పి, వివేక్ మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.