నాలా పూడికతీత పనులను పర్యవేక్షించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్

Published: Thursday April 29, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : చిల్కానగర్ డివిజన్లోని హై కోర్ట్ కాలనీ నుండి కావేరి నగర్ కల్వర్ట్ వరకు నాలా పూడికతీత పనులను మున్సిపల్ అధికారులతో కలిసి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. నాలా పూడికతీత పనులను సకాలంలో పూర్తి చేయాలని బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డిఈ నికిల్ రెడ్డి, ఏఈ రాజకుమార్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, బింగి శ్రీనివాస్, మాస శేఖర్ బాలు, భాస్కర్, ఫార్కక్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.