కెవిఎల్ ఫౌండేషన్ అధినేత నవాబుపేట వైస్ ఎంపీపీ బందయ్య గౌడ్

Published: Friday May 20, 2022

అక్నాపూర్ మేస్త్రి మల్లుగారి నర్సింలుకు ఆర్థిక సహాయం

వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజాపాలన :
అక్నాపూర్ మేస్త్రి మల్లుగారి నర్సింలుకు ఆర్థిక సహాయం చేశామని కెవిఎల్ ఫౌండేషన్ అధినేత నవాబుపేట వైస్ ఎంపీపీ బందయ్య గౌడ్ అన్నారు. నవాబుపేట మండల పరిధిలోని అక్నాపూర్ గ్రామానికి చెందిన మల్లుగారి నర్సిములుకు నాణ్యమైన వైద్య చికిత్సకు ఆర్థిక సహకారం అందజేశారు. గత మూడు రోజుల క్రితం నవాబుపేట మండల పరిధిలోని అక్నాపూర్ గ్రామానికి చెందిన మల్లుగారి నర్సిములుకు వికారాబాదులో ప్రమాదం జరిగి కాలు విరిగిందని వికారాబాదులోని మెడిక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించామని స్పష్టం చేశారు. నాణ్యమైన వైద్య చికిత్స కొరకు 70 వేల రూపాయలు
ఆర్థిక సహాయం చేశారు.  ఎలాంటి అవసరము ఉన్న తాను ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని నర్సింలు కుటుంబానికి భరోసా కల్పిస్తూ ధైర్యం చెప్పారు.