మున్సిపల్ సిబ్బందిని,మెప్మా సిబ్బంది ని సన్మానించిన 7వ వార్డు కౌన్సిలర్

Published: Tuesday June 29, 2021

మధిర ప్రజాపాలన ప్రతినిధి రూరల్ మధిర 28వ తేదీ మున్సిపాలిటీ ఏడవ వార్డులో కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో కరోనా కష్ట కాలంలో పని చేసిన మున్సిపల్ సిబ్బందిని, మెప్మా సిబ్బందిని సన్మానించారు. 7వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా కళ్యాణి కిరణ్ మాట్లాడుతూ ఈ బుట్టలను సక్రమంగా వినియోగించుకుంటూ, తడి పొడి చెత్త ను వేర్వేరుగా వేస్తూ చెత్త ఆటో లలో వెయ్యాలని కోరారు. అలాగే కరోనా బాగా విజ్రంభిస్తున్న ఈ తరుణంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ తప్ప కుండా ధరిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మోదుగు రాజా, కనకపూడి భాస్కర్, నండ్రు బాబు, మొండ్రు అశోక్, పిల్లి దావీదు, మేడికొండ కిరణ్ తదితరులు మరియు మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.