బోడుప్పల్ 21వ డివిజన్లో రూ 35 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Published: Tuesday February 01, 2022
మేడిపల్లి, జనవరి31 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ సాయి భవాని నగర్ కాలనీలో రూ 30 లక్షలతో మరియు ఈస్ట్ బాలాజీ హిల్స్ ఫేజ్ 1లో రూ 5 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ సుమన్ భూక్యతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బోడుప్పల్ కార్పొరేషన్ లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ సుమన్ భూక్య మాట్లాడుతూ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, వీధిలైట్లు వంటి సమస్యలను పరిష్కరిస్తూ, డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డి ఈ కురుమయ్య, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సీసా వెంకటేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, గుర్రాల వెంకటేష్ యాదవ్, బ్యాంక్ డైరెక్టర్ జడిగా రమేష్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ వెలుగొండయ్యా, నాయకులు నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, రాములు గౌడ్, యాదిరెడ్డి, ఉపేందర్రెడ్డి, వార్డు ఆఫీసర్ షాన్ బాబు, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, కాలనీల అసోసియేషన్ సభ్యులు సూర్యనారాయణ, సూరిబాబు, సురేష్, రవీందర్ గౌడ్, కృష్ణమాచారీ, పురుషోత్తం రెడ్డి, అనిల్ రెడ్డి, అంజి రెడ్డి, ఆంజనేయులు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ మల్లేష్, పరశురాములు తామస్, బాబు, తదితరులు పాల్గొన్నారు.