మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మధిర

Published: Saturday March 04, 2023

 మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఈరోజు సాధారణ సర్వసభ్య సమావేశంలో శ్రీమతి మెండెం లలిత మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు ,గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు.  రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ వారు మధిర మండలంలో 8 పనులకు కాను 16 కోట్ల 25 లక్షల రూపాయలు మంజూరి అయినాయని పనులన్నీ టెండర్ ప్రక్రియలో ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు