శ్రీమత్స్య గిరింద్రుని హుండీ లెక్కింపు

Published: Wednesday February 15, 2023


శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు  మంగళవారం ఆలయ ఈవో కే సుధాకర్, డిఐ పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్హల్ రావు, ఆలయ డైరెక్టర్లు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సబ్యులు వారు ఈ హుండీలను లెక్కించారు.  హుండీ ఆదాయం 4,76,550, టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయం 2,95954, వేలం ద్వారా 3,56,516 రూపాయలు, లడ్డు పులిహోర ద్వారా మూడు లక్షల 50 వేల రూపాయలు వచ్చినట్టు ఆలయ సుధాకర్ తెలియజేశారు. మొత్తం రూ.14,79,020 లక్షలు ఆదయం పొందినట్లు ఈవో తెలియజేసారు. బంగారం, వెండి విలువ తర్వాత తెలియజేస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు.