రంజాన్ కానుకలు పంపిణీ
Published: Saturday May 08, 2021
బెల్లంపల్లి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదినం సందర్భంగా అందిస్తున్న కానుకలను పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎం పి పి గోమాస శ్రీనివాస్. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుకల కిట్లను శుక్రవారం నాడు బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురజాల గ్రామంలో పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి వర్గ విభేదాలు లేకుండా ఆయా పండుగలకు అందిస్తున్న కానుకలను తీసుకొని వారి వారి పండుగలను సాంప్రదాయబద్ధంగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత-వెంకటేష్ గౌడ్, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: