వైయస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన సైదులు నాయక్..

Published: Tuesday January 24, 2023
వైరా, జనవరి 23 (ప్రజా పాలన న్యూస్):
 కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు, కొనిజర్ల మండలం ఉప్పల చెలక మాజీ సర్పంచ్ బాదావత్ సైదులు నాయక్ వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాదులోని లోటస్ పండ్ లో ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సమక్షంలో ఆయన వైఎస్ఆర్ టీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైయస్ షర్మిల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సైదులు నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. ఆ మహానుభావుని తనయ  స్థాపించిన పార్టీలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. వైరా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు, వివిధ మండలాల అధ్యక్షులు తాళ్లూరి రాంబాబు, పెరుగు వీర వెంకట ప్రసాద్, చింతల వాసు, బానోతు లాలునాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*